కథ -అత్యంత గొప్ప మిత్రులు

కథ -అత్యంత గొప్ప మిత్రులు

SHYAMPRASAD +91 8099099083
0


*నేను చరిత్ర లో చదివిన అత్యంత గొప్ప మిత్రులు.*

👉 *కృష్ణ-కుచేలుడు*
👉 *కర్ణుడు-దుర్యోధనుడు.*

కృష్ణుడు-కుచేలుడు యాదవ రాజ్యం లో ఆడుకున్నవాడు. తరువాత కృష్ణుడు రారాజయినా, కుచేలుని మనసారా ఆదరించాడు. ‘కొత్తగా అధికారము, ధనమూ వచ్చాయని పాత స్నేహితులని మర్చిపోవద్దు’ అన్నది నీతి..!

*ఎంత కష్ట కాలం లో ఐనా ఒకరినొకరు స్నేహానికి విలువ ఇచ్చిన వారు కర్ణుడు-దుర్యోధనుడు.*

*స్నేహానికి ప్రాణమిచ్చిన కర్ణుడు*

అమ్మా నాన్నలు, బంధవుల్ని దేవుడే సృష్టించి స్నేహితులను మాత్రం ఎంపికచేసుకునే అవకాశం మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే మాట స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. మంచి స్నేహాతుడిని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే వారు జీవితాంతం సంతోషంగా ఉంచుతారు. మనలా ఆలోచించి, గురువులా బోధించి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎలాంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. కష్టంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్యౌషధం స్నేహం.

*మహాభారతంలోనూ కర్ణ, దుర్యోధనల చెలిమి నేటికీ ఆదర్శం.* 
తనను గౌరవించిన దుర్యోధనుడి వెంట మరణం వరకు ఉన్న కర్ణుడు...స్నేహం కోసం ధర్మాన్ని ఎదరించి, తన ప్రాణాలను వదిలాడు. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న ఒకనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి శిబిరానికి వచ్చాడు. కర్ణా... అని పిలవగానే కృష్ణుడి గొంతు విని వడివడిగా వచ్చి కర్ణుడు నమస్కరించాడు. ‘కృష్ణా... ఏమిటి ఇంత రాత్రి వేళ ఈ రాక’ అన్నాడు. కర్ణుడికి జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల పక్షంలోకి రమ్మని శ్రీకృష్ణుడు కోరుతాడు. దీనికి కర్ణుడు చిన్నగా నవ్వి కృష్ణా, నేనెవరన్నదీ నాకు తెలుసు. కురుక్షేత్ర సంగ్రామంలో గెలుపొందేది పాండవులే. ధర్మం పాండవుల పక్షాన ఉంది కనుకనే నువ్వు పాండవుల పక్షాన చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావు. అధర్మ వర్తనులైన కౌరవులు ఎన్నటికీ గెలవరు. ఆ విషయం నాకూ తెలుసు అన్నాడు.

ఇంత తెలిసినవాడివి పాండవుల పక్షాన ఎందుకు చేరడం లేదని శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. అందుకు కర్ణుడు... *దుర్యోధనుడు నన్ను నమ్ముకునే పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. నన్ను నమ్మిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా? నిజమైన స్నేహితునిగా నేను ఉండాలనుకుంటున్నానని తెలిపాడు. తన జన్మ గురించి తెలిసినా, స్నేహితుడిని విడిచి వెళ్లక అతడికి ధైర్యం నూరిపోసిన ధీశాలి కర్ణుడు. స్నేహానికి ప్రతిరూపం అతడు.*

ఇక కృష్ణ, కుచేలుర మైత్రి అపురూపమైంది. సాందీప మహర్షి ఆశ్రమంలో కృష్ణ, కుచేలురు కలసి విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో ఇరువురి మధ్య స్నేహం కుదరింది. విద్యాభ్యాస కాలమంతా కలసి ఉన్న కృష్ణ, కుచేలురు తర్వాత విడిపోయారు. అధిక సంతానంతో ఎన్నో బాధలను అనుభవిస్తున్న కుచేలుడు పిల్లలకు కడుపునిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాడు. అలాంటి సమయంలో కుచేలునికి శ్రీకృష్ణుడు జ్ఞప్తికి వచ్చాడు. శ్రీకృష్ణుని కలసి తన పరిస్థితిని వివరిస్తే అతడు దయచూపుతాడని భావించిన కుచేలుడు కలవాలని నిర్ణయించుకున్నాడు. బంధువుల, స్నేహితులను చూడటానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదని అంటారు. మరి కృష్ణుని వద్దకు ఎలా వెళ్లాలి అని తర్జన భర్జన పడి కొన్ని అటుకులను మూటగా కట్టుకుని ద్వారకకు బయలుదేరాడు.

కుచేలుడు కృష్ణ మందిరంలోకి ప్రవేశించగానే సాదరంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి కుశలమడిగాడు. ‘మిత్రమా! చాలా రోజులకు కలుసుకున్నాం కదా. ఈ స్నేహితునికి తినడానికి ఏమైనా తెచ్చావా?’ అని అన్నాడు. కృష్ణుడు అలా అడిగేసరికి కుచేలుడు సిగ్గుపడి ఏ సమాధానం చెప్పకుండా చేష్టలుడిగిపోయాడు. కృష్ణుడే అటుకుల మూటను చూసి అడిగాడు. కుచేలుడు వాటిని ఇచ్చాడు. కృష్ణుడు వాటిని తినగానే తను, తన కుటుంబం ఎంతగా బాధపడుతున్నదీ చెప్పకుండానే కుచేలుడు తిరుగుముఖం పట్టాడు. సర్వం తెలిసిన పరమాత్ముడు కుచేలుడిని ఐశ్వర్యవంతుడిని చేశాడు. ఇలాంటి నిస్వార్థ స్నేహమే కలకాలం నిలుస్తుంది. ఎవరైనా సరే కృష్ణ, కర్ణులను ఆదర్శగా తీసుకుని స్నేహం చెయ్యాలి.

*మంచి స్నేహం వ్యక్తి వికాసానికి బాటలు వేస్తుంది. మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోను విలువైన స్నేహాన్ని జీవితాంతం నిలుపుకునే ప్రయత్నం చేయాలి. స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా... ఆ విలువైన బంధాన్ని అపురూపంగా కాపాడుకోవాలి.*

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!