కథ-చీమ సహయం

కథ-చీమ సహయం

ShyamPrasad +91 8099099083
0
చీమ సహయం
ఒక పక్షి చెరువులో నీళ్ళు తాగుతుంటే అక్కడ అకస్మాతుగా ఒక చీమ నీళ్ళల్లో పాడడం చూసింది. పాపం చిన్న చీమ నీళ్ళల్లో ఈద లేక కాళ్ళూ, చేతులు కొట్టుకుంటోంది.

జాలి పడి ఆ పక్షి చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. చుట్టూ పక్కల వెతికి ఒక ఆకునే తీసుకుని వచ్చి చీమ దెగ్గిరగా పడేసింది.

చీమ నీళ్ళల్లో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది. చిన్నగా ఆకు మీదకి ఎక్కి ఆకు తేలుకుంటూ చెరువు వొడ్డు మీదకు చేరే దాకా ఆ ఆకుని గట్టిగా పట్టుకుంది. వొడ్డుకి చేరి పక్షికి కృతజ్ఞత తెలియ చేసింది.

రోజులు గడిచేయి. కాలా క్రమేణ పక్షి చీమకు చేసిన సహాయం మర్చిపోయింది. కానీ చీమ మట్టుకు గుర్తు పెట్టుకుంది.

ఒక రోజు అదే పక్షి చీమకి మళ్ళీ కనిపించింది. పలకరిద్దామని దేగ్గిరకి వెళ్తే చెట్టు వెనుక ఒక మనిషి పక్షిని రాయితో కొట్టి చంపాలన్నే ఉద్దేశం తో లక్ష్యం తీసుకుంటూ కనిపించాడు. గబా గబా చీమ మనిషి పాదం ఎక్కి కూర్చుంది. సరిగ్గా రాయి విసరపోతున్న సమయం చూసుకుని గట్టిగా చీమ మనిషిని కుట్టింది.

నొప్పితో మనిషి ఒకటే సారి అరిచాడు. దానితో పాటు గురి తప్పి రాయి కూడా అవతలేక్కడో పది పోయింది.

మనిషి అరుపు విని పక్షి కూడా ఎగిరిపోయింది.

అలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది.

మంచి వాళ్ళు ఎప్పుడు పొందిన సహాయం మర్చిపోరు

Post a Comment

0 Comments

Hi Please, Do not Spam in Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!