కథ - నరుడా ఏమి నీ కోరిక

కథ - నరుడా ఏమి నీ కోరిక

SHYAMPRASAD +91 8099099083
0
" *నరుడా ఏమి నీ కోరిక*  "
*ఒక అద్భుత కధనం*

👌ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది. అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం ?
సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపంకనిపించింది. దాని క్రింద రాసి ఉంది ఒక్క రూపాయి మాత్రమె అని. ఆశ్చర్య పోయాడు పేదవాడు . అంత పెద్ద దీపం ఒక్క రూపాయే ఏమిటి అని ? దగ్గరకు వెళ్లి చూశాడు. అది అల్లాఉద్దీన్ అద్భుత దీపం లా ఉంది. సుమారు ఒక కిలో బరువు ఉంటుంది. అయినా ఒక్క రూపాయేనా ? అది అమ్మేసుకుంటే తనకు ఎక్కువ డబ్బులు వస్తాయిగా ! అదీ అతడి ఆలోచన. షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు. ఎందుకు అంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని. ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది. అది నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అదీ ఈ భూతం కధ. పేదవాడు దానిని ఒక్క రూపాయికి కొనుక్కున్నాడు. ఎప్పుడూ తాను కూచునే చోటికి తీసుకు వెళ్ళాడు. దానిని రుద్దాడు . భూతం ప్రత్యక్షం అయ్యింది" ఏమి నీకోరిక ? అని అడిగింది .
తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు. క్షణాల్లో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది. భోజనం కాగానే ఏమి నీ కోరిక ? అని అడిగింది భూతం. పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది. నిద్రపోతూండగా ఏమి నీ కోరిక ? అని అడిగింది మళ్లీ. ఒక మంచి ఇల్లు కావాలి. వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది. ఏమి నీ కోరిక ? భూతం అడిగింది. పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు. కోరికలు అడుగుతూనే ఉన్నాడు . అవి తీరుతూనే ఉన్నాయి . అతడికి విసుగు వచ్చేస్తోంది. ఎన్నని అడగగలడు ? అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతం తో పాటు సమస్త సంపదలూ పోతాయి. ఎలా ?
పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి నీ కోరిక అంది. భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు . వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం. అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు. పాతేసి ఇంకా ఏమి నీ కోరిక ? అడిగింది. ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు . నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని అది అని చెప్పాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది .
అతను తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు. తన ఇరుగు పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు. తన సౌఖ్యం , తన ఇరుగు పొరుగు సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు .
కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు . భూతం స్థంభం ప్రక్కన నిద్రపోతోంది. తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు.

ఇక్కడితో కధ కాలేదు .
ఈ కధ మనది. మనందరిది.
 ఈ కధనుండి మనం ఏమి నేర్చుకుందాం ?
మన మనసే ఆ భూతం . అది ఎప్పుడూ చైతన్యంగా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది . ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని
సన్యాసి చెప్పిన ప్రకారం భూతం నాటిన స్థంభం  గురువు ఇచ్చిన జ్ఞానోపదేశం. ఎక్కడం దిగడం అంటే సాధన !
      అను నిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది. అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది .అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి , మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము . ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం ! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం!
మన మనసు మాత్రమే కాదు . ఆత్మ అంతకన్నా ఎక్కువ బలం కలది .
మన మనస్సు అవిశ్రాంత స్థితిలో ఉన్నంత వరకూ మనం మన ఆత్మ దర్శనం .చెయ్యలేము .
మనసుకు విశ్రాంతిని ఇచ్చినపుడే మన ఆత్మ మనకు గోచరం అవుతుంది. అపుడే మనం ఇహపరలోకాల ఆనందాలను అనుభవించగలం .
మన మనసు మనకు ఆలోచననూ , విచక్షణనూ , కోరికలనూ , అవగాహననూ , విమర్శనాత్మక దృష్టినీ , న్యాయాన్యాయ నిర్ణయాలు తీసుకునే శక్తినీ , ఎన్నింటినో ఇచ్చింది . దీనివలన మనం ఈ భౌతిక ప్రపంచం లో జీవనం సాగిస్తూ దైవీ స్థితికి చేరుకోలేము.
        మన మనసు భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం. ఆయన తన మనసును ఉపయోగించి ఈ సృష్టిని చేసాడు . మన మనసుకు సరిగా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలా చేస్తుంది
ధ్యానమూ , మంత్రం జపమూ చేస్తే అది మనలను ఆత్మ దర్శనం చెయ్యగలిగే స్థితికి చేరుస్తుంది. మనస్సుని నియంత్రణలో ఉంచుకోలేక పోతే అది మనలని నాశనం చేస్తుంది.
ఒకేసారి అనేక విషయాలను ఆలొచించగలదు. ఒకే ఒక్క విషయం పై కూడా దృష్టి పెట్టగలదు .
.మనసుకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనం ఎన్నో విజయాలను, జీవిత లక్ష్యాలను సాధించగలం.

దాని మానాన దానిని వదిలేస్తే (శిక్షణ లేని మనసు) అది మన వినాశనానికి హేతువులైన దురాశ , పగ , ప్రతీకారం , కామం , క్రోధం , గర్వం , అహంభావం , --- ఇటువంటి అథమ స్థాయి కోరికలకు బానిసలు అయ్యేలా చేస్తుంది .
మన మనసులో కదిలే ఆలోచనలు మన సమయాన్ని , మన దృష్టినీ కోరుతాయి . అవి మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి.🤔

        

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!