కథ - కాళిదాసుకు కనువిప్పు

కథ - కాళిదాసుకు కనువిప్పు

SHYAMPRASAD +91 8099099083
0


🌹🙏🌹🙏🌹🙏

మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి"దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వండి"అని అడుగుతాడు....
గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి  ‘మీరెవరు?ఎక్కడనుండి వస్తున్నారు? 'అంటుంది....

కాళిదాసు "నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? నేను ఓ పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతారు" అని అంటాడు....

ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి..'మీరు అసత్యమాడుతున్నారు. మీరంత గొప్పవారైతే ప్రపంచంలో *ఇద్దరు బలవంతులెవరో* చెప్పండి’ అంటుంది....

కాళిదాసు కాసేపు ఆలోచించి "నాకు తెలియదు. గొంతు ఎండి పోతుంది, ముందు నీళ్లు ఇవ్వండి" అని బతిమాలుకుంటాడు..

"ఆ ఇద్దరు బలవంతులు *ఆకలి, దాహం*.
ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....

ఈసారి ‘నేను బాటసారి’ని అంటాడు కాళిదాసు....
అయితే ఈ లోకంలో *అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు* ఎవరూ అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ....
తెల్ల ముఖం పెట్టి మాతా! "నీళ్ళు ఇవ్వండి. లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను" అంటూ ప్రాదేయపడతాడు కాళీదాసు....

*వాళ్ళు సూర్యచంద్రులు’* అని తెలిపి"మరి మీరెవరో సెలవివ్వండి. నీళ్లిస్తాను" అంటుంది ముసలావిడ....

కాళిదాసు దీనంగా "నేను అతిథిని" అని బదులిస్తాడు....
"మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే *ఒకటి ధనం, రెండోది యవ్వనం* అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు" అంటుంది ముసలావిడ...

కాళిదాసు "నా సహన పరీక్ష  తరువాత చేద్దురు. ముందు నీళ్లు ఇవ్వండి" అని వేడుకుంటాడు....
"ఈ ప్రపంచంలో *ఇద్దరే సహనశీలురు* వారెవరో శెలవివ్వ గలరా" అంటూ...బిక్కమొహం వేసిన కాళీదాసుతో *"ఒకటి భూమి, రెండోది వృక్షం"* అని భోద పరచి" ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు?" అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....

ఓపిక నశించిన కాళిదాసు "నేను మూర్ఖుడను.ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి" అని సాగిల పడతాడు....
ఆ అవ్వ నవ్వుతూ" ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో *ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు"* అని అంటుంది....

ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు....
ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.* *‘నాయనా! విద్యతో వినయం వృద్ధి చెందాలి, అహంకారం కాదు. కీర్తి, ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష’* అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది.

*విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి*.                 
🌹🙏🌹🙏🌹🙏 
Copied from internet.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!