విప్లవ వీరుడు.."చంద్రశేఖర్ ఆజాద్

విప్లవ వీరుడు.."చంద్రశేఖర్ ఆజాద్

SHYAMPRASAD +91 8099099083
0
*విప్లవ వీరుడు.."చంద్రశేఖర్ ఆజాద్"  
➖➖➖➖➖➖➖🌺
★ భారతీయ ఉద్యమకారుడు. భగత్ సింగ్,  రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు.దేశం గర్వించదగ్గ ఉద్యమకారు ల్లో ఒకడు.  

*☄బాల్యము* 
■ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో 
పండిత్ సీతారాం తివారికి, అగరాణీదేవికి  అజాద్ (అసలు పేరు:చంద్రశేఖర్ సీతారాం తివారీ) జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాసిలో చదివించాలను పట్టుదల వుండేది. కాని ఆ పిల్లవాడికి చదువుపూర్తిగా అబ్బలేదు. 
 
*■ చదువుకోడానికి తల్లి తండ్రులు చేసిన ఒత్తిడిని భరించలేక తన పదమూడవ ఏట ఇల్లొదిలి ముంబయి పారి పోయాడు. ముంబయిలో ఒక మురికి వాడలో నివసించాడు. బ్రతకడానికి కూలి పనిచేశాడు. అనేక కష్టాలు పడ్డాడు. అయినా ఇంటికి వెళ్ళాలనిపించ లేదు. ఇంతటి కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది. రెండేళ్ళ ఆ మురికి వాడలో నికృష్టమైన జీవనం తర్వాత 1921 లో వారణాసికి వెళ్ళిపోయి అకడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు.*  

*■ అదే సమయంలో భారత స్వాతంత్ర్యం కొరకు మహాత్మా గాంధీ చేస్తున్న సహాయ నిరాకర ణోద్యమంతో దేశం యావత్తు అట్టుడికినట్టు న్నది. అప్పుడే చంద్ర శేఖర్ తాను కూడా భారత స్వాతంత్ర్యం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించు కున్నాడు.* 

*■ అప్పుడతని వయస్సు పదిహేనేళ్ళు మాత్రమే. ఉత్సాహంగా తాను చదువుతున్న సంస్కృత పాఠశాలముందె ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయ మూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ ఇలా సమాదానాలు చెప్పాడు. నీపేరేంటని అడిగితే 'ఆజాద్' అని, తండ్రి పేరడిగితే  'స్వాతంత్రం' అని, మీ ఇల్లెక్కడ అని అడిగితే  'జైలు' అని సమాదానాలు చెప్పాడు. న్యాయమూర్తి అతనికి 15 రోజులు జైలు శిక్ష విధించాడు.* 

■ ఇతని సమాదానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో ఏమోగాని తాను విధించిన 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్వ బోధ చేసింది. ఆ విధంగా చంద్రశేఖర్.. *"చంద్రశేఖర్ ఆజాద్"* అయ్యాడు. 

*☄విప్లవము... ఉద్యమాలు🔥*

*■ తన స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ మాటల తో ఆజాద్ లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. మిత్రుడైన బిస్మిల్, అఘ్నూల్ల ఖాన్ , రోషన్ సింగ్ లు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు. 1924 ఆగస్టు 9 వ తారీఖున ఈ విప్లవకారులంతా కలిసి కాకోరి అనే వూరు వద్ద ప్రభుత్వ ధనం వున్న రైలును ఆపి దోపిడి చేశారు. కొంత కాలానికి ఆ విప్లవ కారులంతా పోలీసుల చేతికి చిక్కారు ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ తప్ప. చంద్రశేఖర్ అజ్ఞాతవాసంలోకి వెళ్ళి పోయాడు.*

■ రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ ఉత్తరప్రదేశ్ లోని ఓర్చా అరణ్యం లో సతార్ నది ఒడ్డున వున్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రక్కన ఓ కుటీరము నిర్మించుకుని మరిశంకర బ్రహ్మచారీ అనే సాధువు గా మారాడు. ఆ తర్వాత ప్రభుత్వం పై తాము చేసిన అన్ని కుట్రలకు ప్రణాలికలకు ఆ కుటీరమే స్థావరం అయింది. కానీ రైలు దోపిడి కేసులో పోలీసులు చంద్రశేఖర్ కొరకు గాలిస్తూనే ఉన్నారు.

*■ చంద్రశేఖర్ ఆజాద్ 1928 సెప్టెంబర్ లో భగత్ సింగ్, సుఖ్ దేవ్ మొదలగు వారితో కలిసి  'హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ 'అనే సంస్థను స్థాపించారు. వీరందరూ కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాలనుకున్నారు. ఆ కుట్రలో భాగంగా పొరబాటున తాము గురిపెట్టిన వ్యక్తి స్కాట్ అనుకొను సాండర్స్అనే పోలీసు ను కాల్చారు. కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్, రాజ్ గురు లను చనన్ సింగ్  అనే పోలీసు వారిని వెంబడించి పట్టుకో గలిగాడు. ఆ ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో చంద్ర శేఖర్ ఆజాద్ కు తమ మిత్రులను కాపాడుకోడా నికి చనన్ సింగ్ ను కాల్చక తప్పలేదు.*

■ తమ రహస్యజీవనంలో భాగంలో ఝాన్సీ పట్టణంలో సహవిప్లవ కారులతో కలిసి ఒక ఇంట్లో వున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఝాన్సీ పట్టణానంతా గాలిస్తున్నారు. అలా నగరాన్నంతా గాలించి చివరికి ఆజాద్ ఒక గదిలో వుంటాడన్న పూర్తి నమ్మకంతో ఆ గది చుట్టు పోలీసులను మొహరించి ఒక్క ఉదుటున తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేసించారు. కాని ఖాళీగా వున్న ఆ గది వారిని వెక్కిరించింది. ఇది జరిగింది 1929 మే నెల 2వ తారీఖున.

*☄పార్లమెంటు పై దాడి కేసు..*

*■ ఈలోపు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంటు పై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడము, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడము జరిగి పోయాయి. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతొ కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాల నుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరిం చాలని వేడుకున్నాడు ఆజాద్. కాని నెహ్రూ అజాద్ కు ఏ సమాదానము చెప్పలేదు.*

■ దాంతో..కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పార్క్ లో తమ ఇతర విప్లవ మిత్రులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చల్లో పాల్గొన్న వారి లో రహస్య పోలీసులున్నారని అనుమాన మొచ్చింది ఆజాద్ కి. వెంటనే తన రివ్వార్ కి పని చెప్పాడు. ముగ్గురు పోలీసులు అతని తూటాలకు బలైపోయారు. 

*■ ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నా రు. వారు అజాద్ ని వెంబడిస్తూనె ఉన్నారు. ఆజాద్ వారిని తన రివ్వాల్వర్తో నిలవరిస్తూనే ఉన్నాడు.తన తుపాకీలో ఇంకో తూటానె మిగిలి ఉంది. అది మరొకని ప్రాణం మాత్రమే తీయ గలదు. ఆ తర్వాత తాను పట్టుబడటం ఖాయం అని తెలిసిపోయింది. చీ..!బ్రిటిష్ వారికి తాను పట్టుబడటమా, అంతే మరో క్షణం ఆలోచించ లేదు ఆజాద్ పోలీసుల వైపు గురిపెట్టబడిన తన తుపాకి తన తలవైపు మళ్ళింది. అంత 25 ఏండ్ల యువకుడు చంద్రశేఖర ఆజాద్ అమరుడయ్యాడు.. ఇది జరిగిన రోజుకి సరిగ్గా 25 రోజుల తర్వాత భగత్ సింగ్ ను ఉరి తీశారు.*

*■ అజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వన్నె తెచ్చిన ఘటన. భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్వల ఉదాహరణ.*వందేమాతరం మనదే జయభారతం

ఆయన దైర్యం..త్యాగం..దేశభక్తి..మనమెప్పటికి   మరువము..మరువలేము కూడా..

అమర్ రహే..అమర్ రహే..ఆజాద్✊

(జూలై 23, 1906 – ఫిబ్రవరి 27, 1931)
                🍃🌸🤗🌸🍃

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!