టంగుటూరి ప్రకాశం పంతులు 20-5-1957 న స్వర్గస్తులైనారు

టంగుటూరి ప్రకాశం పంతులు 20-5-1957 న స్వర్గస్తులైనారు

SHYAMPRASAD +91 8099099083
0
“శాలువా నాకేందుకు ఆరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా “ అన్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి
వర్థంతి సందర్భంగా

నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుఱ్ఱాడు తన పరీక్ష ఫీజు కు మూడు రూపాయలు లేక ,వాటికోసం తన ఊరుకు 25 మైళ్ళదూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలినడకన బయల్దేరాడు.తీరాచేసి బావగారింటికి వెడితే 'నాదగ్గర మాత్రం ఎక్కుడున్నాయిరా'అన్నాడా బావ గారు.చేసేదేముందనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు ఆ కుఱ్ఱాడు. ఆ పరిస్థితి కి తల్లడిల్లిపోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడురూపాయల ఫీజు కట్టింది.ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కామొక్కీలు తిని తనకిష్టమైన ప్లీడరీ పరీక్షలో నెగ్గి,అక్కడితో తృప్తి పడక ఇంగ్లండ్ పోయి బారిష్టరయ్యి మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆ రోజులలోనే(1917-18 నాటికే)రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో , కోస్తా జిల్లాలన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసేటంతగా ఎదిగిన మన కాలపు మేరునగధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు.

గాంధీజీ పిలుపుతో తన ప్లీడరు వృత్తిని వదిలి జాతీయోద్యమంలోకి ఉరికాడు.తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు. లాయర్ గా ఎంతోమందిని జైళ్ళనుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజలకోసం తాను స్వచ్చందంగా జైలుశిక్షను అనుభవించాడు.గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం 'స్వరాజ్య' పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందాడు.అదే గాంధీజీ కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే గాంధీజీని సైతం నిలదీశాడు.సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాళ్ జరిగినప్పుడు తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టాడు.ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా,ముఖ్యమంత్రి గా పనిచేశాడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు(1953)తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యాడు.
దురాశాపరుల మూలంగానూ,శాసన సభ స్పీకర్ తెలివి తక్కువ తనం మూలంగానూ ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైనప్పుడు , వ్యతిరేకంగా ఓటువేసిన వారు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ ఓటింగ్ కు వెడదామని బ్రతిమాలుకున్నా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామాను సమర్పించాడు.కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాడు.శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించాడు. తెలుగు వారికి ఓ హైకోర్టు స్థాపించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించాడు.సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపాడు.బెజవాడలో కాటన్ దొర కట్టిన బరాజ్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆనాటి కేంద్ర ప్రభుత్వం పైసా కూడ ఇవ్వలేమని స్పష్టం చేస్తే,రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బరాజ్ ను బాగుచేయించి నిలబెట్టాడు.ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా ఆ లోటును సరిదిద్దాడు.అందుకే ప్రజలందరూ ఆ బరాజ్ ను ఆయన పేరునే ప్రకాశం బారేజ్ గా పిలుచుకుంటున్నారు.రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశాడు.
అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్ర్యాన్ననుభవించాడు.తనను శాలువతో సత్కరిస్తే “ఈ శాలువ నాకెందుకురా!ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనితెస్తే ఓ పూట గడిచేది కదురా!! “ అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా అధికారం కోసం ప్రాకులాడలేదు. 85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండుటెండలో వడదెబ్బకు మరణించిన ఇద్దరు ముదుసలుల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బ తిని, తెలుగు పౌరుషాన్ని పైలోకాలకు తీసుకుపోయిన " ఆంధ్రకేసరి" ప్రకాశం పంతులు గారికి 💐💐🙏🙏

*స్వాతంత్ర్య సమరయోధుల  సేవలు  చిరస్మరణీయం*

*మే 20 న మన దేశ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ బిపిన్ చంద్రపాల్ గారి వర్ధంతి సందర్బంగా మరియు  స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్థంతి  సందర్బంగా*

*మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు*

డోన్ పట్టణం  స్థానిక టీచర్స్ కాలనీ నందు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి  ఆధ్వర్యంలో మే 20న మన దేశ స్వాతంత్ర్య
సమరయోధులు శ్రీ బిపిన్ చంద్రపాల్ గారి వర్ధంతి సందర్బంగా మరియు  స్వాతంత్ర్యసమర యోధులు ఆంధ్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్థంతులను పురస్కరించుకొని వారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించి వారిని  స్మరించుకున్నారు.
ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లాడుతూ
1) శ్రీ బిపిన్ చంద్ర పాల్  నవంబరు 7, 1858 న బంగ్లాదేశ్ లో జన్మించారు. ఈయన  సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు లాల్ బాల్ పాల్ త్రయంలో మూడవ వాడు.  జాతీయోద్యమ పత్రిక వందే మాతరం ను మొదలు పెట్టాడు. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమర మందు ఉత్తేజితులను చేసాడు. బ్రహ్మసమాజంలో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ప్రజలను ఉత్తేజపరిచే ఉపన్యాసకుడిగా పేరొందారు. వందేమాతరం ఉద్యమ వ్యాప్తిలో భాగంగా రాజమండ్రిలో ఈయన ప్రసంగించిన ప్రాంతాన్ని ‘పాల్‌ చౌక్‌’ అని పిలుస్తున్నారు.
మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఈయన ఉపన్యాసాల ప్రభావంతోనే ఏర్పాటు చేయబడింది. ట్రిబ్యూన్‌, న్యూ ఇండియా, వందేమాతరం మొదలైన పత్రికల్లో ఈయన రచనలు ఎన్నో ప్రచురింపబడినాయి.ఆనాటి రాజకీయాల్లో ప్రధాన పాత్రధారులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర్‌ తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌ అనే నాయక త్రయాన్ని ‘లాల్‌, బాల్‌, పాల్‌’ అని సగౌరవంగా పిలిచేవారు. శ్రీ బిపిన్ చంద్ర పాల్  మే 20, 1932 స్వర్గస్తులైనారు.ఇలాంటి మహనీయులైన స్వాతంత్ర్య సమరయోధులను ఎల్లవేళల స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్తలు డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు.
2) శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 1872 ఆగష్టు 23 న ప్రకాశంజిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో ని యోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు.
ఈయన సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు. వారి ఆశయాలను, నిరాడంబరతను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి  పేర్కొన్నారు. ఆయన  పేద కుటుంబంలో జన్మించినప్పటికీ కృషి, పట్టుదలతో న్యాయవాదిగా ఎదిగి మద్రాస్, ఢిల్లీలలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మద్రాసులో సైమన్ కమిషన్‌కు ఎదురు తిరిగి బ్రిటీష్‌వారి తుపాకులకు ఎదురు నిలిచి గుండె చూపి తనను కాల్చమని ధైర్యంగా నిలిచిన వ్యక్తి ప్రకాశం పంతులు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి గా బిరుదు పొందిన వ్యక్తిగా ఆయన్ను కొనియాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో టంగుటూరు ప్రకాశం పంతులు పాత్ర కీలకమైందన్నారు. 1916 నుంచి ప్రతి ఉద్యమంలో పాలుపంచుకున్నారని తెలిపారు. 1928లో సైమన్ కమిషన్ గోబ్యాక్ అనే నినాదంతో ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ ఉద్యమంలో బ్రిటీష్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తన ఛాతిని తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచి చూపించారని, దీంతో ఆయన ఆంధ్రకేసరిగా పేరుపొందారని తెలిపారు. మద్రాసు నుంచి విడిపోయిన తరువాత ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు పని చేశారని, పరిపాలనాపరంగా ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజి నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలో, అలాగే సూక్ష్మ సేద్యంలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో  సత్యాగ్రహ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారని తెలిపారు.ఈయన 20-5-1957 న స్వర్గస్తులైనారు.ఈయన ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి  సూచించారు.స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పోరాటాలు, త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం మన అందరి పై  ఎంతైనా ఉందన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!