ఎందుకు మరిచామో చెప్పండి.
----------------------------------------
ప్రతిజ్ఞ
------------
భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
-------------------------------------------
రచయిత.....
నల్గొండ నివాసి పైడిమర్రి వేంకట సుబ్బారావుగారు. 1962 లో భారత చైనా యుద్ధం సందర్భంగా ప్రజలలో విద్యార్థులలో దేశభక్తి పెంపొందించటానికి వ్రాసిన ప్రతిజ్ఞ ఇది. 1965 లో దేశంలోని అన్ని భాషలలోనికి అనువదించడం జరిగింది. ఆంగ్లంలో ఇండియా "ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్" తో మొదలైతుంది.
మరచిపోవటానికి కారణం పైడిమర్రి వేంకటసుబ్బారావు గారు వ్రాసిన ప్రతిజ్ఞకు ఇచ్చిన ప్రాధాన్యత గౌరవంఆయన ఇవ్వకపోవడమే.
----------------------------------------------------------------------------------------